Atmakuru: ఆత్మకూరులో వక్ఫ్ బోర్డు స్థల వివాదం.. తీవ్ర వాగ్వాదం!
Atmakuru: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎల్ఆర్ పల్లిలో వక్ఫ్ బోర్డు స్థల వివాదం కలకలం. సర్వే నంబర్ 852 భూమిలో హద్దుల ఏర్పాటుపై వాగ్వాదం.
Atmakuru: ఆత్మకూరులో వక్ఫ్ బోర్డు స్థల వివాదం.. తీవ్ర వాగ్వాదం!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎల్ఆర్ పల్లి ప్రధాన వీధిలో వక్ఫ్ బోర్డు స్థలానికి సంబంధించి వివాదం నెలకొంది. వక్ఫ్ బోర్డు స్థలంలో హద్దులు ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా, స్థానిక వక్ఫ్ బోర్డు సిబ్బంది అడ్డుకున్నారు.
సంబంధిత వ్యక్తులు ఆ స్థలం తమ సొంతమని పేర్కొనగా, వక్ఫ్ బోర్డు సిబ్బంది మాత్రం అది సర్వే నంబర్ 852లోని వక్ఫ్ బోర్డు భూమిగా పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయమై సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.స్థల వివాదంపై సమాచారం అందడంతో నెల్లూరు నుంచి వక్ఫ్ బోర్డు అధికారులు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు, స్థల నిర్వాహకుల మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితిని పరిశీలించిన జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఖుదావన్ మాట్లాడుతూ స్థలాలపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి,రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.




