Nellore: సీతారామపురం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం!

Nellore: నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పోరుమామిళ్ల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం. ఆవులను తప్పించబోయి 150 అడుగుల లోయలో పడ్డ సిమెంట్ మిక్సర్ లారీ.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 30 May 2026 1:31 PM IST
Nellore
X

Nellore: సీతారామపురం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం!

నెల్లూరు: సీతారామపురం మండలం పోరుమామిళ్ల ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.సిమెంట్ మిక్సర్ లారీ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆవులను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ రహదారి పక్కన ఉన్న సుమారు 150 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి లారీ నుంచి చాకచక్యంగా దూకడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాదంలో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. భారీగా లోయలో పడిపోవడంతో సిమెంట్ మిక్సర్ లారీ పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాదం జరిగిన సమయంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story