Nellore: ఈనెల 17న నెల్లూరులో మాదిగల సమ్మేళనం.. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం!

Nellore: నెల్లూరులో ఈనెల 17న జరగనున్న మాదిగల సమ్మేళన సదస్సుకు హాజరు కావాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీమాంధ్ర ఎమ్మార్పీఎస్, జేఏసీ నేతలు ఆహ్వానం పలికారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 15 Sept 2026 10:18 PM IST
Nellore
X

Nellore: ఈనెల 17న నెల్లూరులో మాదిగల సమ్మేళనం.. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఈనెల 17న నిర్వహిస్తున్న మాదిగల సమ్మేళన సదస్సుకు ఆహ్వానం కావాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్యతో పాటు పలువురు మాదిగ జేఏసీ నేతలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు

ఈ మేరకు మాదిగ జేఏసీ నేతలు మంగళవారం సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సత్కరించారు. మాదిగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నేతలు శేఖర్, పల్లాల శ్రీనివాసులు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE