Sangam: సాగునీటి సంఘం అధ్యక్షుడిగా మేకల రవీంద్ర ఏకగ్రీవ ఎన్నిక!
Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా మేకల రవీంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Sangam: సాగునీటి సంఘం అధ్యక్షుడిగా మేకల రవీంద్ర ఏకగ్రీవ ఎన్నిక!
సంగం: ఇటీవల అధ్యక్షుడు గంగపట్నం చంద్రశేఖరయ్య మృతితో ఖాళీ అయిన అధ్యక్ష పదవికి ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రక్రియలో ప్రత్యర్థులు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో మేకల రవీంద్రాను ఏకగ్రీవ ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మేకల రవీంద్రను అధికారులు, డైరెక్టర్లు అభినందించారు.
ఈ సందర్భంగా మేకల రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్యర్యంలో సాగునీటి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీ నివాసులురెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Next Story




