Nellore: మొక్కల వివాదం.. ఆరోపణలపై రూప్ కుమార్ యాదవ్ కౌంటర్

Nellore: నెల్లూరులో మొక్కల పెంపకం వివాదంపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

V. Narasimhulu, Nellore
Published on: 21 April 2026 1:52 PM IST
Nellore
X

Nellore

Nellore: నెల్లూరులో మొక్కల పెంపకం అంశంపై నెలకొన్న వివాదంపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పందించారు. వీఆర్సీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణకు పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

వీఆర్సీ గ్రౌండ్స్‌ను సీఎస్ఆర్ నిధులతో సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్లు తెలిపారు. గత ఏడాది కాలంగా నిర్వహణ కోసం మంత్రి కుటుంబం సుమారు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

పేద విద్యార్థుల కోసం మంత్రి కుటుంబం 10 వేల సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పిల్లలకు అవసరమైన సదుపాయాలను మంత్రి కుటుంబం అందిస్తున్నదని అన్నారు.

మంత్రి నారాయణపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, రాజకీయాలను రాజకీయాలుగానే చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మొక్కల పెంపకంపై పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసే వారు తమ వైఖరి మార్చుకోవాలని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story