Nellore: పెనుబర్తిలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనుబర్తి గ్రామంలో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించారు.
Nellore: పెనుబర్తిలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
Nellore: నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పెనుబర్తి గ్రామంలో 36 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ని ప్రారంభించారు బిజెపి వీర మహిళలు కరణం సుభాషిణి మరియు చిలకల ప్రవీణారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పెనుబర్తి గ్రామ అభివృద్ధికి 3కోట్ల 50లక్షల రూపాయలు కేటాయించామని, ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
పై కార్యక్రమంలో ఎంపీపీ బూడిద విజయ్ కుమార్,వైస్ ఎంపీపీ పల్లంరెడ్డి రవీంద్ర రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, టీడీపీ నాయకులు పల్లంరెడ్డి భాస్కర్ రెడ్డి, చిరమన శ్రీనివాసులు రెడ్డి, దినేష్ రెడ్డి, పల్లంరెడ్డి జశ్వంత్ రెడ్డి, శివయ్య నాయుడు, తుమ్మతాటి రవి, పల్లంరెడ్డి సుమంత్ రెడ్డి, మనోహర్, తాండ్ర పెంచలయ్య, రవి, రమేష్, వాసు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.




