Kamareddy: సీయూఈటీలో బీర్కూర్ విద్యార్థిని ప్రతిభ.. హెచ్‌సీయూలో సీటు!

Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు చెందిన మల్లెల శివ సేతన జాతీయ స్థాయి CUET ప్రవేశ పరీక్షలో 96 పర్సంటైల్ సాధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో సీటు దక్కించుకుంది.

SALEEM, BANSWADA
Published on: 17 Aug 2026 8:44 PM IST
Kamareddy
X

Kamareddy: సీయూఈటీలో బీర్కూర్ విద్యార్థిని ప్రతిభ.. హెచ్‌సీయూలో సీటు!

కామారెడ్డి: కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగిన మల్లెల శివ సేతన ప్రతిభ చాటింది. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులు హాజరైన CUET (Central University Entrance Test)లో 96 పర్సంటైల్ సాధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో హిస్టరీ విభాగంలో సీటు సాధించింది.

సివిల్స్ పరీక్షకు సిద్ధమై భవిష్యత్తులో IAS అధికారి కావాలనే లక్ష్యంతో శివ సేతన CUET ప్రవేశ పరీక్షకు మూడు నెలల పాటు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. తక్కువ సమయంలోనే క్రమశిక్షణతో చదివి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో మంచి పర్సంటైల్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

శివ సేతన తల్లిదండ్రులు ఇద్దరూ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకున్న ఆమె, భవిష్యత్తులో సివిల్స్‌లో విజయం సాధించి IAS అధికారిగా ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్న వయసులోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని, అందుకు అనుగుణంగా కృషి చేస్తున్న యువతి.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story