Bodhan: కల్దుర్కిలో వాజపేయి వర్ధంతి ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు!
Bodhan: బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి వేడుకలు. ఆయన సేవలను స్మరించుకున్న బీజేపీ నాయకులు.
Bodhan: కల్దుర్కిలో వాజపేయి వర్ధంతి ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు!
Bodhan: దేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి వర్ధంతిని బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
భారత రాజకీయాల్లో నవశకానికి నాంది పలికి, దార్శనిక నాయకత్వంతో దేశ పురోగతికి బాటలు వేసిన మహనీయుడు, భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
అటల్ జీ కేవలం రాజకీయ నాయకుడే కాదు; గొప్ప కవి, ప్రతిభావంతుడైన వక్త, మరియు అజాతశత్రువు. విపక్ష నాయకులచేత కూడా ప్రశంసలు పొందిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం.
ప్రధానమైన సేవలు మరియు మార్గదర్శకత్వం:
అణు శక్తి సమర్థత: పోఖ్రాన్-2 అణు పరీక్షలతో భారత్ను ప్రపంచ వేదికపై అణురాష్ట్రంగా నిలబెట్టి, దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పారు.
మౌలిక వసతుల విప్లవం.అటల్ బిహారీ వాజపేయి సిద్ధాంతాలు, ఆదర్శాలు మరియు దేశసేవా నిరతి భావి తరాలకు ఎల్లప్పుడూ తెలియజేయాలి.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జ్యోతి శంకర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు న్యాలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్,బీజేపీ సీనియర్ నాయకు లచ్చప్ప, భాస్కర్ రెడ్డి, రాజన్న, గంగా కిషన్, వార్డ్ మెంబర్లు , చంద్రకాంత్, రామ్ జీ,మల్లు గోండ, అశోక్, రాజు,కార్యకర్తలు అశోక్ పటేల్,రాములు, చందు, సాయిలు, మాధవరావు సాయి,రచప్ప, తదితరులు పాల్గొన్నారు.




