Bodhan: ఖండ్గాంవ్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీఓ విజయ కుమారి
Bodhan: బోధన్ ఆర్డీఓ ఎం. విజయ కుమారి ఖండ్గాంవ్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను, విద్యాబోధన తీరును పరిశీలించారు.
Bodhan: ఖండ్గాంవ్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీఓ విజయ కుమారి
బోధన్: ఆర్డీఓ, బోధన్, యం. విజయ కుమారి ఖండ్గాంవ్ లో ని ప్రాథమిక పాఠశాల నందు, మధ్యాన భోజన వసతులను, వంటశాల ను సందర్శించి, అక్కడ పిల్లలకు సమకూరుస్తున్న భోజనం నాcణ్యత ను పరిశీలించారు.
ఉపాధ్యాయుల తో సంభాషించి, ఎటువంటి విద్యావిధానాలను అవలంబిస్తున్నారోఅని అడిగితెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గనిర్దేశాల మేరకు నివృత్తి చేసుకునే విధంగా, అవసరమైన సూచనలను ఆర్డివో అందించారు.
గణితం మరియు ఆంగ్ల భాషా మాధ్యమం ఇప్పటి నుండే నాణ్యమైన స్థాయి లో బోధించటం వల్ల, గ్రామ స్థాయి విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయి లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారిలో స్ఫూర్తిని నింపారు.
Next Story




