Bodhan: ఈద్గాల ను సందర్శించిన సీపీ సాయి చైతన్య

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ పర్యటన.

K RAVI, BODHAN
Published on: 28 May 2026 2:38 PM IST
Bodhan
X

Bodhan: ఈద్గాల ను సందర్శించిన సీపీ సాయి చైతన్య 

బోధన్: పట్టణంలోని నర్సి రోడ్డు లో గల ఈద్గాల ను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్షించారు. బక్రీద్ పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన బందోబస్త్ పై ఆరాతీశారు. ఎలాంటిఅవంచానియా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు పై అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల పనితీరు పై సైతం ఆరాతీశారు. అనుమాస్పద వ్యక్తులు కనిపించిన వివాదాలు చెలరేపే వ్యక్తులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆయన వెంటఅడిషనల్ డిసిపీ శుభం ప్రకాష్, ఏసీపీ శ్రీనివాస్, ఎస్ హెచ్ వో వెంకట్ నారాయణ్ సీఐ లు ఎస్ లు ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story