Bodhan: నిప్పులపాలైన మూగజీవాల మేత.. బోధన్‌లో భారీ అగ్నిప్రమాదం

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏక చక్రేశ్వర మందిరం వద్ద గల గోశాలలో అగ్నిప్రమాదం జరిగింది.

K RAVI, BODHAN
Published on: 3 May 2026 8:11 PM IST
Bodhan
X

Bodhan: నిప్పులపాలైన మూగజీవాల మేత.. బోధన్‌లో భారీ అగ్నిప్రమాదం

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర మందిర్ వద్ద ఆదివారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 30 వేల గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టణంలోని గోశాలకు సంబంధించిన గడ్డివాములకు ప్రమాదవశాత్తు నిప్పండుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లినట్లు గోశాల నిర్వాహకులు పేర్కొన్నారు.

ప్రమాద సమయంలో గోశాలలో గోవులు లేకపోవడంతో బాటకి పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపు పూర్తిగా గడ్డిమోపులు దగ్ధమైపోయాయి. మూగజీవాలకు తాతల సహకారంతో కట్టించిన గడ్డిమోపులు దగ్ధమవడంతో గోవులకు మేత కరువై ప్రమాదం వాటిలిందని గోప్రేమికులు పేర్కొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story