Banswada: రాష్ట్ర స్థాయి పరుగు పోటీలకు తాడ్కోల్ యువకుడు శివ ఎంపిక
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్కు చెందిన పీఈటీ ఉపాధ్యాయుడు శివ 100 మీటర్ల రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యారు.
Banswada: రాష్ట్ర స్థాయి పరుగు పోటీలకు తాడ్కోల్ యువకుడు శివ ఎంపిక
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల ను నిర్వహించగా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన శివ 100 మీటర్ల పరుగు పందెంలో ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం శివ స్పార్క్ మైండ్ పాఠశాలలో పి ఈ టి టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఆదివారం పాఠశాల యాజమాన్యం సిబ్బంది శివను సన్మానించి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాశం రాజిరెడ్డి, కరస్పాండెంట్ కిరణ్, డైరెక్టర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.




