Nizamabad: దారుణం.. ముళ్లపొదల్లో పసిపాపను వదిలేసిన కసాయి తల్లి!
Nizamabad: నిజామాబాద్ జిల్లా మోపాల్ - సిర్పూర్ రోడ్డు పక్కన ముళ్లపొదల్లో పడేసిన నవజాత ఆడ శిశువును 108 సిబ్బంది కాపాడారు.
Nizamabad: దారుణం.. ముళ్లపొదల్లో పసిపాపను వదిలేసిన కసాయి తల్లి!
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వరుస నవజాత శిశువుల ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి. వారంరోజుల క్రితం జీజీహెచ్ డ్రెనేజీలో నవజాత శిశువు మృతదేహం లభించగా.. తాజాగా బుధవారం ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలివెళ్లగా స్పందించి 108 సిబ్బంది అక్కున చేర్చుకున్నారు.
ఈ ఘటన మోపాల్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.మోపాల్–సిర్పూర్ గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో నవజాత శిశువు ఏడుపు వినిపించిన స్థానికులు వెంటనే 108సిబ్బందికి సమాచారం అందించారు.
తక్షణమే స్పందించిన సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆడ శిశువును అక్కున చేర్చుకుని జిల్లా ఆస్పత్రికి GGH తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రెండురోజుల క్రితం జన్మించినట్లుగా వైద్యులు పేర్కొంటున్నారు.




