Nizamabad: రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు!
Nizamabad: డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్లో హైవే డాబాలు, వ్యాపార సముదాయాల నిర్వాహకులతో రోడ్డు భద్రత, గంజాయి నివారణపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
Nizamabad: రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు!
నిజామాబాద్ : డిచ్ పల్లి మండలం కేంద్రం ని KNR గార్డెన్ ఫంక్షన్ హాల్లో డిచ్ పల్లి, జక్రాన్ పల్లి ఇందల్వాయి మండలాల పరిధిలోని హైవే డాబాలు, మాధవనగర్ వరకు ఉన్న వ్యాపార సముదాయాల నిర్వాహకులతో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, డిచ్ పల్లి సీఐ వినోద్ ఎస్. ఐ ఆరిఫ్, జక్రాన్ పల్లి ఎస్. ఐ మహేష్, ఇందల్వాయి ఎస్.ఐ సుమలత,పాల్గొని అనధికార పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, అక్రమ మద్యం విక్రయాలు, గంజాయి వినియోగం నివారణ, భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధవ్యాపార నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




