Markapuram: మార్కాపురం జిల్లాలో మే 1 నుంచి జనగణన.. కలెక్టర్ ఆదేశం

Markapuram: మార్కాపురం జిల్లాలో మే 1 నుండి 31 వరకు నిర్వహించనున్న జనగణనపై జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కీలక ఆదేశాలు జారీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 30 April 2026 2:10 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లాలో మే 1 నుంచి జనగణన.. కలెక్టర్ ఆదేశం

మార్కాపురం: జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ విజయ సునీత. మార్కాపురం జిల్లాలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జన గణనను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఈ జన గణనను చేపట్టడానికి జిల్లాలోని 21 మండలాల్లోని 497 గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో 2073 మంది ఎమ్యూనరేటర్లు, 350 మంది సూపర్వైజర్ లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఉదయం సాయంత్రం వేళల్లో అధికారులు, సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి జనగణన వివరాలు సేకరించాలన్నారు. ఇంటికి వచ్చిన జనగణన సిబ్బందికి ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆమె చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించి జయప్రదం చేయాలని కలెక్టర్ విజయ సునీత కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story