Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీలో ఓటర్ల వెరిఫికేషన్ షురూ
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల వెరిఫికేషన్ (Voter Verification) సర్వేను మున్సిపల్ కమిషనర్ రమణబాబు ప్రారంభించారు.
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీలో ఓటర్ల వెరిఫికేషన్ షురూ
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో సర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కమిషనర్ రమణబాబు నిర్వహించారు. సిబ్బందితో కలిసి నాగార్పంచాయతీ లోని వార్డుల్లో పర్యటించి ఓటర్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఈనెల 14వ తేదీలోపు ఓటు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీ పరిధిలో 31 వేలకు పైగా ఓట్లు ఉన్నాయని వీటన్నిటిని స్వయంగా సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వివరాలు సేకరిస్తారని అందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు.
గతంలో ఓట్లు ఎక్కడ ఉన్నాయో అనే విషయాన్ని కూడా వెరిఫికేషన్ చేయడంతో పాటు కొత్తవారి ఓట్లు సేకరణ మరియు వివరాలు చేరికలు వంటి అంశాలు ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
Next Story




