Giddalur: గిద్దలూరులో సచివాలయ సిబ్బంది ఆత్మీయ సమావేశం

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో అర్బన్ సచివాలయ సిబ్బంది ఆత్మీయ సమావేశం. సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక 'వెల్ఫేర్ ఫండ్' ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 17 Aug 2026 11:36 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో సచివాలయ సిబ్బంది ఆత్మీయ సమావేశం

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎన్జీవో హోం మీటింగ్ హాల్ నందు ఈరోజు (సోమవారం, 17 ఆగస్టు 2026) గిద్దలూరు అర్బన్ స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది ఆత్మీయ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు అర్బన్ పరిధిలోని 10 వార్డు సచివాలయాలకు చెందిన అన్ని విభాగాల కార్యదర్శులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఎల్లప్పుడూ ఐకమత్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అర్బన్ సచివాలయ సిబ్బంది కోసం ఒక ప్రత్యేక 'వెల్ఫేర్ ఫండ్' (సంక్షేమ నిధి) ఏర్పాటు చేయాలని అందరూ కలిసికట్టుగా తీర్మానించారు. భవిష్యత్తులో సిబ్బందిలో ఎవరికి ఏ విధమైన ఆర్థిక లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా, ఈ నిధి ద్వారా తక్షణ సహాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై అందరూ సంఘటితంగా ఉంటూ ఒకరికొకరు మద్దతుగా నిలవాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే ఈ సంక్షేమ నిధి నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణపై అనుభవజ్ఞులైన పెద్దల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సిబ్బంది నిర్ణయించారు. ఈ ఆత్మీయ సమావేశం గిద్దలూరు అర్బన్ సచివాలయ సిబ్బంది మధ్య ఐక్యతను చాటిచెప్పింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story