Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 20 July 2026 11:52 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్

Markapuram: మార్కాపురం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన **ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్‌ఎస్) లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ స్థలాలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఉపాధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన పలు వినతులను ప్రజలు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని పరిశీలించిన శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకుని అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మరియు హాస్పిటల్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story