Pullalacheruvu: పుల్లలచెరువులో మద్యం మత్తులో బైక్ నడుపుతూ వ్యక్తి మృతి

Pullalacheruvu: పుల్లలచెరువులో ఘోర బైక్ ప్రమాదం. మద్యం మత్తులో వాహనం అదుపుతప్పి రెమిడిచర్లకు చెందిన వెంకటేశ్వర రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం.

Srikanth Singam, Markapur
Published on: 3 July 2026 1:31 PM IST
Pullalacheruvu
X

Pullalacheruvu: పుల్లలచెరువులో మద్యం మత్తులో బైక్ నడుపుతూ వ్యక్తి మృతి

పుల్లలచెరువు: మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుల్లలచెరువులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, రెమిడిచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి ఉమ్మడివరం గ్రామంలో వివాహం చేసుకున్నట్లు తెలియజేశారు.

మద్యం మత్తులో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story