Markapuram: టోల్ గేట్ వద్ద ప్రమాదం.. ఈదురుగాలులకు లేచిపోయిన పైకప్పు!

Markapuram: మార్కాపురం పరిధిలోని త్రిపురాంతకం మండలం మేడపి టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది.

Srikanth Singam, Markapur
Published on: 25 May 2026 9:18 PM IST
Markapuram
X

Markapuram: టోల్ గేట్ వద్ద ప్రమాదం.. ఈదురుగాలులకు లేచిపోయిన పైకప్పు!

Markapuram: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి టోల్ గేట్ వద్ద ఆదివారం రాత్రి భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ పై ఏర్పాటు చేసిన పైకప్పు నిర్మాణం గాలుల ధాటికి ఒక్కసారిగా లేచిపోయింది. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటన సమయంలో అక్కడ ఉన్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. టోల్ గేట్ పరిసర ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story