Prakasam: చేతుల్లో చీపురు పట్టిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
Prakasam: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Prakasam: చేతుల్లో చీపురు పట్టిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
Prakasam: ఈరోజు సంతనూతలపాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం చేపడుతున్న స్వచ్చ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్చ గ్రామం -ప్లాస్టిక్ రహిత గ్రామం, గ్రీన్ ఆంధ్ర సందర్బంగా ఈరోజు సంతనూతలపాడు గ్రామంలో స్వచ్చ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్. గ్రామంలో పర్యావరణ కాపాడుకుందాము అంటూ ఎమ్మెల్యే గారు మొక్కలను నాటారు.
చెత్తను స్వయంగా ఎమ్మెల్యే గారు ఊడ్చి పరిశీరాలను శుభ్రం చేసారు.అందరిచేత స్వచ్చ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి. ఎన్.విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను దూరంగా ఉంచాలని వీలైనంతవరకు జ్యూట్ బ్యాగులు, కాగితపు సంచీలు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు తద్వారా భవిష్యత్ తరాలను కాపాడిన వారమవుతామని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు నో చెప్పండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు,పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




