Vijay Antony: ఓటీటీలోకి వస్తున్న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’!
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘వంద దేవుళ్లు’ .
Vijay Antony: ఓటీటీలోకి వస్తున్న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’!
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘వంద దేవుళ్లు’ . నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) తెలుగు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రీమియర్ ప్రకటనను విడుదల చేసింది.
ఆగస్టులో జీ5 వేదికగా స్ట్రీమింగ్..
థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఆగస్టు నెలలో జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే, మేకర్స్ కచ్చితమైన స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఇటీవల ZEE5లో విడుదలైన ‘పరిమళ & కో’ కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, అదే కోవలో ఈ ‘వంద దేవుళ్లు’ కూడా వస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.
కథాంశం … నేపథ్యం
ఈ చిత్రంలో శ్వాసిక విజయ్ ప్రధాన పాత్రలో నటించగా.. భర్తను కోల్పోయి, తన ఇద్దరు పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ మధ్యవయస్కురాలైన ఇల్లాలు కథ ఇది. నలభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆమె తన జీవితంలో తోడు కోసం (పునర్వివాహం) ఆలోచించడం, ఆ నిర్ణయాన్ని బంధువులు, గ్రామం , సమాజం తీవ్రంగా వ్యతిరేకించడం వంటి ఎమోషనల్ పాయింట్పై ఈ సినిమా నడుస్తుంది.
తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని, త్యాగాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూనే.. మహిళల వ్యక్తిగత సంతోషం, సమాజపు ఆలోచన ధోరణులను ప్రశ్నించేలా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శశి తెరకెక్కించారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.




