Kadiyam: కడియం మండలం దుళ్లలో భారీ చోరీ నగదు బంగారం అపహరణ!

Kadiyam: రాజమండ్రి రూరల్ కడియం మండలం దుళ్ల గ్రామంలో భారీ చోరీ. టైలర్ సత్యనారాయణ ఇంట్లో రూ. 3.5 లక్షల నగదు, 10 కాసుల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 31 Aug 2026 6:57 AM IST
Kadiyam
X

Kadiyam: కడియం మండలం దుళ్లలో భారీ చోరీ నగదు బంగారం అపహరణ!

Kadiyam: తాళం వేసిన ఈ ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్ళిన సంఘటన కడియం మండలం దుళ్ల లో చోటుచేసుకుంది.. వివరాలు లోకి వెళితే స్థానిక ఎర్ర కాలనిలో నివాసముంటున్న టైలర్ మానేం సత్యనారాయణ కుటుంబ సబ్యులతో కలసి ఆదివారం ఉదయం వేములపల్లి లో ఓ వేడుకకు వెళ్లారు ఇది గమనించిన దుండగులు 11.30 ప్రాంత0లో గుర్తుతెలియని దుండగుడు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి మూడున్నర లక్షలు నగదు, సుమారు పది కాసులు బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు అయితే ఇంటి యజమాని సత్యనారాయణ సాయంత్రం ఇంటికి రాగా తాళాలు పగుల గొట్టి ఉండడాన్ని గమనించి లోపలకు వెళ్లి చూడగా దొంగతనం జరిగి నట్టు గుర్తించి కడియం పోలీసులకు సులకు ఫిర్యాదు చేశారు.

డీఎస్పీ శివ ప్రియ, ఎస్.ఐ దుర్గాప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు అలాగే క్లూస్ టీం ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story