Gokavaram: గోకవరం వంతెన వివాదం.. ఎమ్మెల్యే నెహ్రూపై పాటంశెట్టి ఫైర్!

Gokavaram: గోకవరం తానా సెంటర్ వద్ద వంతెన నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 18 Jun 2026 8:49 AM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం వంతెన వివాదం.. ఎమ్మెల్యే నెహ్రూపై పాటంశెట్టి ఫైర్!

గోకవరం: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పై పాటంశెట్టి సూర్యచంద్ర ఫైర్. గోకవరం తానా సెంటర్ వద్ద నూతన వంతెన నిర్మాణం పై అసంతృప్తి వ్యక్తం చేసిన పాటంశెట్టి.

జెడ్ ఆకారంలో నిర్మించాల్సిన వంతెనను స్వప్రయోజనాల కోసం ఎస్ ఆకారంలోకి మార్చారు. జ్యోతుల నెహ్రూ ప్రతిపక్షంలో ఒక మాట అధికారం వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వంతెనపై నెహ్రూ అలుపెరగని పోరాటం చేశారని, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఈ వంతెన నిర్మాణం పట్ల ఎమ్మెల్యే నెహ్రూ పునరాలోచించి, వంకరలు లేని వంతెనను నిర్మించాలని, లేనిచో కూటమి ప్రభుత్వం ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story