Devarapalli: దేవరపల్లిలో గంజాయిపై ఎస్పీ భారీ ర్యాలీ!

Devarapalli: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 31 July 2026 4:37 PM IST
Devarapalli
X

Devarapalli: దేవరపల్లిలో గంజాయిపై ఎస్పీ భారీ ర్యాలీ!

దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సర్కిల్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలంతా పోలీసులకు సహకరిస్తే గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టవచ్చని ఆయన అన్నారు.

దేవరపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. నాగేశ్వర్ నాయక్, ఎస్సైలు మనోహర్, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మానవతా సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా లేదా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుని తప్పనిసరిగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

ర్యాలీ ముగింపులో విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందనను రేకెత్తించింది.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story