Mamidikuduru: కర్బలా యాత్రికుల కోసం మామిడికుదురులో ప్రత్యేక మజ్లిస్!

Mamidikuduru: మామిడికుదురులో కర్బలా పుణ్యక్షేత్రానికి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక మజ్లిస్ నిర్వహణ. షబ్బర్ అలీ జైదీ మజ్లిస్ ప్రసంగం, శ్రద్ధాంజలి వివరాలు.

PRABHU, RAZOLE
Published on: 21 Aug 2026 11:28 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: కర్బలా యాత్రికుల కోసం మామిడికుదురులో ప్రత్యేక మజ్లిస్!

Mamidikuduru: ఇరాక్‌లోని కర్బలా పుణ్యక్షేత్రానికి వెళ్లనున్న యాత్రికుల కోసం ఖాసీం మహమ్మద్ రజివి సారథ్యంలో మజ్లిస్ నిర్వహించారు. మామిడికుదురులోని హజరత్ అబ్బాస్ పంజా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మత ప్రబోధకులు షబ్బర్ అలీ జైదీ మజ్లిస్ ఆలపించారు. పంజా నిర్వాహకులు కలిబే అబ్బాస్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా యాత్రికులు హజరత్ ఇమామ్ హుస్సేన్ పరివారానికి చెందిన అమరవీరుల స్మారక కట్టడాలను సందర్శించి, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తారని మత ప్రబోధకులు తెలిపారు. కర్బలా పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులకు ఇమామ్ హుస్సేన్ సైన్యాధిపతి హజరత్ అబ్బాస్ అన్ని ఏర్పాట్లు జరిగేలా చూసుకుంటారని పేర్కొన్నారు.

కర్బలా పుణ్యక్షేత్రం సాధారణంగా సుమారు 60 లక్షల మంది యాత్రికులకు సరిపడే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ‘అరెబయిన్’ కార్యక్రమానికి సుమారు 6 కోట్ల మంది యాత్రికులు హాజరవుతున్నారని తెలిపారు. ఇంతమంది యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరగడం హజరత్ అబ్బాస్ చమత్కారంగా భక్తులు విశ్వసిస్తారని మత ప్రబోధకులు పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story