Malikipuram: మలికిపురం ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళి

Malikipuram: గొల్లపాలెంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిడిపి ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య. ఆయన సేవలను కొనియాడారు.

PRABHU, RAZOLE
Published on: 15 July 2026 5:02 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురం ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళి

మలికిపురం: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, గొల్లపాలెం గ్రామంలో కాపు ఉద్యమ నేత స్వర్గీయ ముద్రగడ పద్మనాభంకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి గొల్లపల్లి అమూల్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గ హక్కులు, సంక్షేమం కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతే లక్ష్యంగా ఆయన చేసిన కృషి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూపిన చిత్తశుద్ధి తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

అనంతరం ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముద్రగడ పద్మనాభంకు ఘనంగా నివాళులర్పించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story