Rajahmundry: రాజమండ్రి వైభవంగా ఉమా రామలింగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ

Rajahmundry: రాజమండ్రి జాంపేటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 8 July 2026 4:13 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి వైభవంగా ఉమా రామలింగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ

రాజమండ్రి: నగరంలోని జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించిన విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునరుద్ధరణతో పాటు విగ్రహ పునఃప్రతిష్ఠ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని, యువతలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంచుతాయన్నారు.

విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో వేద పండితులు యాగశాల పూజలు, హోమాలు, కలశాభిషేకాలు, వేదాశీర్వచనాలతో కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగగా, భక్తిశ్రద్ధలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story