Rajahmundry: నీట్ నిరసన కేసులన్నీ ఎత్తేయాలి: మేడా శ్రీనివాస్!

Rajahmundry: విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 2 Aug 2026 11:14 PM IST
Rajahmundry
X

Rajahmundry: నీట్ నిరసన కేసులన్నీ ఎత్తేయాలి: మేడా శ్రీనివాస్!

రాజమండ్రి: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన పోలీసు కేసులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్‌పీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ వారాంత సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

దేశ యువత భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, విద్య, ఉపాధి రంగాల్లో ఏర్పడుతున్న సమస్యలు యువతను నిరాశకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. పాలకుల విధానపరమైన తప్పిదాలు యువత భవిష్యత్తుకు శాపంగా మారుతున్నాయని విమర్శించారు. హక్కుల కోసం ప్రశ్నించే విద్యార్థులు, యువతపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని, ఈ నేపథ్యంలో జరిగిన నిరసనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాల్సిందని మేడా శ్రీనివాస్ అన్నారు. నిరసనల వెనుక సంఘవిద్రోహ శక్తులు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపిస్తే, ఆ అంశాలపై పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

నీట్ లీక్ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రభుత్వ వైఫల్యాన్ని పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగినట్లు కాదని, అసలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు.

విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి వేధించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ లోపాలను వెలుగులోకి తీసుకువచ్చిన విద్యార్థులను శిక్షించే ధోరణిని విరమించి, వారిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశానికి ఆర్‌పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో డి.వి. రమణమూర్తి, సిమ్మా దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, బసా సోనియా, దుడ్డే త్రినాథ్, మాసా అప్పాయమ్మ, మట్టపర్తి తులసి, మాసా సుభద్ర, కందివలస రమణ, కందివలస హైమావతి, కూరాకుల నాగమణి, మాసా ప్రవీణ్, మాసా ప్రమీల, అడపా శేషగిరి, మీసాల దేవి, చల్లా సాంబశివరావు, నాగురి దుర్గ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story