Rajanagaram: తంటికొండ వెంకన్న ఆలయ హుండీ ఆదాయం రూ.7,72,114!
Rajanagaram: గోకవరం తంటికొండ వెంకన్న ఆలయంలో హుండీ లెక్కింపు.. 4 నెలల 20 రోజుల కాలానికి రూ.7.72 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడి.
Rajanagaram: తంటికొండ వెంకన్న ఆలయ హుండీ ఆదాయం రూ.7,72,114!
Rajanagaram: గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించగా, 4 నెలల 20 రోజుల కాలానికి గాను రూ.7,72,114/- ఆదాయం లభించింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర, ఈఓ శ్రీ పాటి సత్యనారాయణ, ఈవో చల్ల ఉదయ్ బాబు నాయుడు ధర్మకర్తల మండలి సభ్యులు చింతల నాగేశ్వరరావు, బొట్టా రామకృష్ణ, చప్పిడి పెంటరాజు, మల్లా అమ్మాజీ, సుంకర వీరమణి, వేగి దుర్గాదేవి, నాగులపాటి అరుణకుమారి, పసుమర్తి సత్యకళ, వల్లూరి ప్రసాద్, మడకం పద్మ, పెద్దింటి దత్త, శేషాచార్యులు (ఎక్స్-ఆఫీషియో సభ్యులు) పాల్గొన్నారు.
అలాగే ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, సేవకులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.




