Rampachodavaram: ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ సేవా కార్యక్రమం!

Rampachodavaram: రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. మంజు శ్రీనివాస్ నేతృత్వంలో కొనసాగిన సేవలు.

Prasanna, Rampachodavaram
Published on: 11 Aug 2026 12:18 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: ఆసుపత్రిలో వేదాగ్ని ట్రస్ట్ సేవా కార్యక్రమం!

Rampachodavaram: పోలవరం జిల్లా, రంపచోడవరం వేదాగ్ని ట్రస్ట్ అధినేత మంజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పడంతో పాటు అల్పాహారాన్ని అందజేశారు. సమాజసేవ లక్ష్యంగా వేదాగ్ని ట్రస్ట్ నిరంతరం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జ్ చిన్నం టోనీ బాబు, చిన్నం కుమారి, కె. నరసింహమూర్తి ( నాని) సుంకరి దుర్గ రెడ్డి, పోలేపల్లి సతీష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

'మానవసేవే మాధవసేవ' అనే లక్ష్యంతో వేదాగ్ని ట్రస్ట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story