Devarapalli: యర్నగూడెంలో మెడ్ ప్లస్ స్టోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి

Devarapalli: దేవరపల్లి మండలం యర్నగూడెంలో శ్రీ మహాలక్ష్మీ ఫార్మసీ మెడ్ ప్లస్ స్టోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. నాణ్యమైన మందులు అందించాలని పిలుపు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 23 July 2026 3:49 PM IST
Devarapalli
X

Devarapalli: యర్నగూడెంలో మెడ్ ప్లస్ స్టోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని నిడదవోలు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మీ ఫార్మసీ వారి మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాటు ధరల్లో లభించేలా మెడికల్ షాపులు సేవలందించడం ఎంతో అవసరమన్నారు. వ్యాపార రంగం కేవలం లాభాలకే పరిమితం కాకుండా సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా వైద్య రంగానికి అనుబంధంగా పనిచేసే మెడికల్ షాపులు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ప్రజలకు నాణ్యమైన మందులు, వైద్య అవసరాలకు సంబంధించిన వస్తువులు సరసమైన ధరలకు అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. సేవా దృక్పథంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న శ్రీ మహాలక్ష్మీ ఫార్మసీ వ్యవస్థాపకులు, యువ వ్యాపారవేత్త నూతంగి దొరబాబును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కొర్లపాటి అన్నవరం, గద్దె హరిబాబు, సుంకర దుర్గారావు, తంగెళ్ల మునేశ్వరరావు, బళ్ల సూర్యచక్రం, బొల్లిన విజయభాస్కర్, గద్దె శ్రీనివాస్, టెక్కెం చిట్టిబాబు, బళ్ల రాము, మండ సుబ్బారావు, కొలుకులూరి రవి తదితరులు పాల్గొని నూతన మెడికల్ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రారంభోత్సవం అనంతరం అతిథులు మెడికల్ స్టోర్‌లోని సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story