Siddipet: రూ. 531 కోట్ల బకాయిలు చెల్లించాలి.. రేవంత్ ప్రభుత్వాన్ని కోరిన జేఏసీ
Siddipet: తెలంగాణలో మాజీ సర్పంచుల ఆందోళన. 2019-2024 మధ్య చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 531 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్.
Siddipet: రూ. 531 కోట్ల బకాయిలు చెల్లించాలి.. రేవంత్ ప్రభుత్వాన్ని కోరిన జేఏసీ
Siddipet: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచుల బాధలు వర్ణనాతీతమని సిద్దిపేట జిల్లా తొగుట మండలం మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర JAC రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నరసింహులు యాదవ్ అన్నారు. గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
Next Story




