Siddipet: కనీస వేతనాల పెంపుపై సంబరాలు చేద్దాం: శ్రీనివాస్ రెడ్డి

Siddipet: తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది.

Chindam Karunakar, Dubbak
Published on: 22 May 2026 8:42 AM IST
Siddipet
X

Siddipet: కనీస వేతనాల పెంపుపై సంబరాలు చేద్దాం: శ్రీనివాస్ రెడ్డి

సిద్దిపేట జిల్లా: దుబ్బాక, తొగుటలో తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త అందిస్తూ, కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పెరిగిన కనీస వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కార్మిక సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని సిఎం రెవంత్ రెడ్డి చిత్రపటానికి పాలబిషేకం కార్యక్రమం నిర్వహిద్దాం.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story