Dubbaka: కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన సిపిఎం నాయకులు
Dubbaka: దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం (CPM) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Dubbaka: కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన సిపిఎం నాయకులు
దుబ్బాక: పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాని నిరసిస్తూ కేంద్ర దిష్టిబొమ్మ దహనం చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బస్టాండ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు పెట్రోల్ చేశారుఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ పైన మూడు రూపాయలు.
సిఎన్జి పైన రెండు రూపాయలు పెంచి దేశ ప్రజల నడ్డి విరుస్తు దుర్మార్గమైన చర్యలు చేపడుతుందని పొదుపు పేరు మీద ఆయిల్ ఆదా చేయాలని సూక్తులు చెప్తు ప్రజల పేరు మీద భారం మోపుతున్న నరేంద్ర మోడీకి దేశ ప్రజల పైన విజ్ఞతలేదని లేదని ప్రశ్నిస్తున్నామన్నారు. కేవలం అంబానీ ఆదాని వాళ్ల కోసమే ఈరోజు ధరలు పెంచడం జరిగిందని,12 సంవత్సరాల కాలంలో నలపై లక్షల కోట్ల సేస్ ను వసులు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అ సేస్ వీటికి వినియోగించాలి.




