Toguta: లారీలు రాక.. ధాన్యం సేకరణ స్తంభన.. రాంపూర్ వద్ద రైతుల నిరసన
Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్లో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల నిరసన. 40 రోజులుగా వేచిచూస్తున్న రైతులు, సీఎం దిష్టిబొమ్మ దహనం.
Toguta: లారీలు రాక.. ధాన్యం సేకరణ స్తంభన.. రాంపూర్ వద్ద రైతుల నిరసన
Toguta: 4వేల బస్తాలలో ధాన్యం నింపినప్పటికీ లారీలు రాకపోవడంతో, వర్షాలు కురిస్తే ధాన్యం తడిసే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డును దిగ్భందించిన సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ లో చోటు చేసుకుంది.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకోచ్చి 40 రోజులు దాటినా కొనుగోల్లు కావడం లేదని ప్రభుత్వ నిర్లక్ష్యం ను నిరసిస్తూ రాంపూర్ వద్ద రోడ్డుపై రైతులు మండు టెండలో గంటపాటు బైటాయించారు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళన లో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యం ఫై తూర్పార పట్టారు.. కొనుగోళ్ల లో ప్రభుత్వం కు ముందుచూపు కొరవడం మూలంగానే రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. రోహిణి కార్తి ముగిస్తున్నప్పటికీ ఎక్కడ చూసినా.




