Siddipet: నర్సమ్మ కుటుంబానికి ఇందిరమ్మ కమిటీ భరోసా

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో మరణించిన నాగులపల్లి నర్సమ్మ కుటుంబాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులు పంది రాజు పరామర్శించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 14 May 2026 2:32 PM IST
Siddipet
X

Siddipet: నర్సమ్మ కుటుంబానికి ఇందిరమ్మ కమిటీ భరోసా

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల మరణించిన నాగులపల్లి నర్సమ్మ కుటుంబాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులు పంది రాజు పరామర్శించారు.శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి 3000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు.

కుటుంబ పెద్దను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు బెజ్జనబోయిన అనిల్, వార్డు సభ్యులు కల్లేపు భాను చందర్, నాయకులు బెజ్జనమైన రాములు, జంగపల్లీ ఆంజనేయులు, , వడ్డే నర్సింలు,నాగులపల్లి బాలయ్య,నాగులపల్లి స్వామి,నాగులపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story