Dubbaka: దుబ్బాకలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం..

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.

Chindam Karunakar, Dubbak
Published on: 7 Jun 2026 9:18 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం..

దుబ్బాక: క్యాన్సర్ పై పోరాటానికి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో, ఓ ఆస్పత్రి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించను న్నారు.

ఈ మేరకు ఆదివారం దుబ్బాకలో నిర్వహించే శిబిరంతో ఈ కార్యక్రమాన్నిషురూ చేయనున్నారు. అందుకోసం ప్రత్యేక బస్సును రూపొందించారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణుల బృందం పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. బ్రెస్ట్, సర్వైకల్, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనుమానా స్పద లక్షణాలు ఉన్నవారికి తదుపరి చికిత్స, వైద్య సలహాలపై మార్గ నిర్దేశం చేయనున్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story