Thoguta: తొగుట మెట్టు వద్ద రైస్ మిల్లులో కలెక్టర్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట శారదాంబ రైస్ మిల్లును ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thoguta: తొగుట మెట్టు వద్ద రైస్ మిల్లులో కలెక్టర్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు
తొగుట: జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మెట్టు దగ్గర ఉన్నాటు శారదాంబ రైస్ మిల్ లో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), వైస్ చైర్మన్ కొంగరి నర్సింలు, తొగుట తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, APM బాబురావు, ASI రాంరెడ్డి, ఎల్లారెడ్డి పేట సర్పంచ్ రాంపురం రమేష్, ఆదిత్య AMC డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి రైస్ మిల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.*
*ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేలా లారీలను ఏర్పాటు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ధాన్యం తరలించాలని అధికారులకు సూచించారు.రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) తెలిపారు.




