Dubbaka: అమర్నాథ్ యాత్ర బండిని ప్రారంభించిన స్వామి సమర్థ మహారాజ్
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీశ్రీశ్రీ స్వామి సమర్థ మహారాజ్.
Dubbaka: అమర్నాథ్ యాత్ర బండిని ప్రారంభించిన స్వామి సమర్థ మహారాజ్
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శ్రీశ్రీశ్రీ స్వామి సమర్థ మహారాజు స్థానిక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు విచ్చేసి అమర్నాథ్ యాత్ర కొరకు ఏర్పాటు చేసిన నిత్యవసర సరుకుల బండి ని పూజ చేసి జెండా ఊపడం జరిగింది.
అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకు అందరికీ వారి సందేశం ఇవ్వడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అద్భుతం మహాద్భుతం అని వారు ప్రశంసించారు.
అందరూ కలిసిమెలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి అని వారు తెలియజేశారు ఈ ప్రాంతం ఎంతో పుణ్యం చేసుకుంది ఎంతోమంది వేల భక్తులు నా దగ్గరకు వస్తున్నారు మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా వస్తున్నారు కావున ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని వారు తెలియజేశారు.
Next Story




