Siddipet: మృతుల కుటుంబీకులను పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్
Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటించారు.
Siddipet: మృతుల కుటుంబీకులను పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్
Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామ వాస్తవ్యులు గుండమనేని బాలకిషన్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈరోజు చైర్మన్ వెంకటయ్య వారి కుటుంబీకులను పరామర్శించి అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
ఇబ్రహీంపూర్ గ్రామ వాస్తవ్యులు కోమండ్ల నారాయణరెడ్డి గారి సతీమణి మంజుల గారు మరణించగా చైర్మన్ వెంకటయ్య గారు అతనిని వారి స్వగృహంలో పరామర్శించారు. ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు దుబ్బాక పాక్స్ చైర్మన్ కైలాసం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడతల రవీందర్ రెడ్డి,కొత్త కిషన్ రెడ్డి, రుద్రారం సర్పంచ్ ఇదారి కనకయ్య, దొడ్ల శ్రీనివాస్, అరవింద్ ఇతర ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ఉన్నారు.
Next Story




