Viral Video: గూడ్స్ రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్ పట్టుకున్న వ్యక్తి.. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలసిన వైనం!
Viral Video: బిహార్లోని దర్భంగాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలుపైకి ఎక్కిన ఒక వ్యక్తి, హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Viral Video: గూడ్స్ రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్ పట్టుకున్న వ్యక్తి.. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలసిన వైనం!
Viral Video: బిహార్ రాష్ట్రంలో గుండెలను పిండేసే అత్యంత విషాదకర సంఘటన ఒకటి వెలుగుచూసింది. దర్భంగా జిల్లాలోని లహేరియాసరయ్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి మూర్ఖత్వం లేదా మతిస్తిమితం లేని ప్రవర్తన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆగి ఉన్న గూడ్స్ రైలుపైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో అతడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు.
లహేరియాసరయ్ రైల్వే స్టేషన్లో ఒక గూడ్స్ రైలు పట్టాలపై ఆగి ఉంది. ఆ సమయంలో మతిస్తిమితం సరిగా లేని ఒక వ్యక్తి ఎవరికీ అందకుండా రైలు బోగి పైకి ఎక్కాడు. బోగిపై అటు ఇటు తిరుగుతూ ప్రమాదకరంగా ప్రవర్తించసాగాడు. ఇది గమనించిన ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది కిందకు దిగమని గట్టిగా కేకలు వేశారు. కానీ, ఆ వ్యక్తి ఎవరి మాట వినకుండా ఒక బోగిపై నుంచి మరో బోగిపైకి వెళ్తూ ఎడమ చేతిని పైకి ఎత్తి నడవసాగాడు.
ప్రయాణికులు వారించే లోపే, పైకి ఎత్తిన అతని వేళ్లు పైన ఉన్న హైటెన్షన్ వైర్ను తాకాయి. అంతే, ఒక్కసారిగా భారీ స్థాయిలో విద్యుత్ ప్రవహించడంతో ఆ వ్యక్తి క్షణాల్లో కాలిపోయి బోగిపైనే విగతజీవిగా పడిపోయాడు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "ఆ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది" అని కొందరు, "రైల్వే స్టేషన్లలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి మతిస్తిమితం లేని వారు రైలు పైకి ఎక్కకుండా చర్యలు తీసుకోవాలి" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.




