PNG: 90 రోజుల్లో కనెక్షన్ తీసుకోకుంటే గ్యాస్ సిలెండర్ రాదు.. ఎందుకంటే

PNG: మీ ప్రాంతంలో PNG సదుపాయం ఉండి, మీరు కనుక ఆ కనెక్షన్ తీసుకోకపోతే, మీ గ్యాస్ సిలెండర్ సరఫరాను నిలిపివేస్తారు

KVD Varma
Published on: 25 March 2026 12:30 PM IST
PNG: మీ ప్రాంతంలో PNG సదుపాయం ఉండి, మీరు కనుక ఆ కనెక్షన్ తీసుకోకపోతే
X

PNG

PNG: మీ ప్రాంతంలో PNG గ్యాస్ పైప్‌లైన్ వేసినట్లయితే, రాబోయే మూడు నెలల్లోగా మీ ఇంటికి ఎల్‌పిజి సిలిండర్ల సరఫరా నిలిచిపోవచ్చు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, గ్యాస్ కొరతకు ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం "సహజ వాయువు - పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు 2026"ను అమలు లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం, ఇకపై అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ పొందడం తప్పనిసరి అవుతుంది. నోటీసు అందుకున్న తర్వాత కూడా ఎవరైనా కనెక్షన్ తీసుకోకపోతే, 90 రోజుల తర్వాత వారికి LPG సరఫరా నిలిపివేస్తారు.

సొసైటీలు కూడా మూడు రోజుల్లోగా పైప్‌లైన్‌ను ఆమోదించాల్సి ఉంటుంది.

1. సొసైటీలు-ఆర్‌డబ్ల్యుఏల ఏకపక్ష నిర్ణయాలను అంతం చేయడం

హౌసింగ్ సొసైటీలు లేదా ఆర్‌డబ్ల్యుఏల (నివాసి సంక్షేమ సంఘాలు) వ్యతిరేకత కారణంగా పైప్‌లైన్ పనులు తరచుగా నిలిచిపోతున్నాయి.ఇకపై అలా జరగదు.

ఒక కంపెనీ పైప్‌లైన్ మార్గం కోసం అడిగితే, సొసైటీ 3 రోజుల్లోగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

సొసైటీ నిరాకరించినా లేదా ఆలస్యం చేసినా, అక్కడ నివసిస్తున్న అన్ని ఇళ్లకు ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉంటుంది.

2. చిన్న ప్రాంతాలకు 10 రోజుల్లో అనుమతి లభిస్తుంది

ఇప్పుడు ప్రభుత్వ శాఖలు పైప్‌లైన్‌లు వేయడానికి సంబంధించిన ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడానికి వీలు లేదు.

చిన్న నెట్‌వర్క్‌లకు 10 రోజుల్లో, పెద్ద లైన్‌లకు 60 రోజుల్లో ఆమోదం తప్పనిసరి.

నిర్ణీత సమయంలోగా సంబంధిత శాఖ స్పందించకపోతే, దానిని 'డీమ్డ్ క్లియరెన్స్'గా, అంటే 'ఆటోమేటిక్ అప్రూవల్'గా పరిగణించి పని ప్రారంభించడం జరుగుతుంది.

3. భూమి -పరిహారం గందరగోళం లేదు..

పైప్‌లైన్ ప్రైవేట్ భూమి నుంచి వెళితే, నష్టపరిహార వివాదం ఇకపై సంవత్సరాల తరబడి సాగదు. ప్రభుత్వం సర్కిల్ రేటు ఆధారంగా ఒక స్థిరమైన సూత్రాన్ని ఏర్పాటు చేసింది. భూ యజమాని అంగీకరించడానికి నిరాకరిస్తే, పనులు ఆలస్యం లేకుండా జరిగేలా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటారు.

4. ఇది మీ భద్రత- పొదుపు కోసమే..

యుద్ధం లాంటి పరిస్థితులలో కూడా మీకు వంటగ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు, ప్రభుత్వం దీనిని నిత్యావసర వస్తువుల చట్టం కింద జారీ చేసింది.

ప్రయోజనం: మీరు సిలిండర్ బుకింగ్ గురించి లేదా అది అయిపోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ప్రతికూలత: సిలిండర్‌ను తమ ఇష్టానుసారం ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిమిత ఎంపికలు మాత్రమే ఉంటాయి.

పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వరు.

మార్చి 14న, ప్రభుత్వం పీఎన్‌జీ కనెక్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం, మీ ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ ఉన్నట్లయితే, మీరు ఇకపై మీ ఎల్పీజీ సిలిండర్‌ను తిరిగి ఇచ్చివేయవలసి ఉంటుంది. కొత్త ఉత్తర్వు ప్రకారం, పీఎన్‌జీ వినియోగదారులకు కొత్త ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వరు. అలాగే వారి పాత సిలిండర్లను రీఫిల్ కూడా చేయరు. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ఇంతకుముందు నాలుగు సార్లు కొత్త నిబంధనలను జారీ చేసింది.

ఎల్పీజీ సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలివే..

మార్చి 6: గృహ వినియోగ సిలిండర్ల బుకింగ్ కోసం 21 రోజుల లాక్-ఇన్ వ్యవధిని ప్రవేశపెట్టారు (అనగా, మొదటి సిలిండర్ అందుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే రెండవ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు).

మార్చి 9: డిమాండ్ పెరగడంతో నగరాల్లో లాక్-ఇన్ కాలాన్ని 25 రోజులకు పొడిగించారు.

మార్చి 12: గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్ బుకింగ్‌లో లాక్-ఇన్ వ్యవధి 45 రోజులకు పెరిగింది.

మార్చి 14: పీఎన్‌జీ (పైపు గ్యాస్) వినియోగదారులు ఎల్‌పిజి సిలిండర్లను కలిగి ఉండటాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధమని ప్రకటించింది. పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారు ఇకపై తమ సిలిండర్లను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. వాటిని రీఫిల్ చేయలేరు.

ముఖ్యమైన సందేహాలకు నిపుణుల సమాధానాలు..

ప్రశ్న: నేను ఇప్పుడు సిలిండర్‌ను తిరిగి ఇవ్వాలా?

సమాధానం: లేదు, ఇప్పుడైతే కాదు. మీ ప్రాంతంలో పైప్‌లైన్ యాక్టివేట్ చేయబడి, మీకు నోటీసు అందిన తర్వాత మూడు నెలల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.

ప్రశ్న: సిలిండర్ కంటే PNG చౌకైనదా?

జవాబు: సాధారణంగా, PNG బిల్లు వినియోగాన్ని బట్టి వస్తుంది. ఇది LPG కంటే చౌకైనది. ఇది ఎల్ఫీజీ కంటే సురక్షితమైనదిగా పరిగణిస్తారు.

ప్రశ్న: ఒకవేళ మా ఇంటికి పైప్‌లైన్ వేయడం సాంకేతికంగా సాధ్యం కాకపోతే?

జవాబు: అటువంటి పరిస్థితిలో మీ ఎల్పీజీ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. ఈ నియమం పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story