ప్రపంచవ్యాప్తంగా ‘స్నేహితుల కరువు’.. పెరిగిపోతున్న ఒంటరితనం!
Friendship Recession: ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సామాజిక సమస్య 'స్నేహితుల కొరత'. ఒకప్పుడు వందల్లో ఉన్న స్నేహితుల సంఖ్య, నేడు పదుల లోపుకు పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ‘స్నేహితుల కరువు’.. పెరిగిపోతున్న ఒంటరితనం!
Friendship Recession: ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ‘స్నేహితుల కొరత’. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.గణాంకాలు ఏం చెబుతున్నాయి?
1960లలో ఒక వ్యక్తికి సగటున 100 మంది వరకు సన్నిహిత స్నేహితులు ఉండేవారట. 1990ల నాటికి ఆ సంఖ్య 50కి పడిపోయింది. 2020 వచ్చేసరికి అది కాస్తా 10కి చేరింది.మరి ఇప్పుడు? ఒక్క నిజమైన స్నేహితుడు దొరకడమే గగనంగా మారింది. ఇటీవలి సర్వే ప్రకారం మన దేశంలో 12% మందికి చెప్పుకోదగ్గ స్నేహితుడే లేడట.
ఒకప్పుడు రోజుకు కనీసం గంటసేపు స్నేహితులతో ముఖాముఖిగా గడిపేవాళ్లం. ఇప్పుడు అది 35 నిమిషాలకు పరిమితమైంది. స్క్రీన్ల మీద గడిపే సమయం పెరిగింది, మనసు విప్పి మాట్లాడే మనుషుల సంఖ్య తగ్గింది.స్నేహం జీవితానికి ఇన్సూరెన్స్.
మంచి స్నేహితులు నిజంగా ‘లైఫ్ ఇన్సూరెన్స్’ లాంటివారు. ఎందుకంటే:
ఆరోగ్యానికి మేలు: స్నేహితులు లేని ఒంటరితనం రోజుకు 20 సిగరెట్లు తాగినంత ప్రమాదకరమని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్ వారిని చుట్టుముడతాయి.




