Viral Video : చిట్టి రాధమ్మను చూసి భక్తుల ఫిదా.. వీడియో వైరల్.!

Viral Video : చిన్ని కృష్ణుడిని, ముద్దుల రాధమ్మను చిన్నారుల రూపంలో చూస్తే ఎవరి మనసైనా పులకరించిపోతుంది. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశమే ఒక

G Krishna
Published on: 6 Sept 2026 2:17 PM IST
Viral-Video
X

Viral-Video

Viral Video : చిన్ని కృష్ణుడిని, ముద్దుల రాధమ్మను చిన్నారుల రూపంలో చూస్తే ఎవరి మనసైనా పులకరించిపోతుంది. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశమే ఒక ఆలయంలో ఆవిష్కృతమైంది. రాధాదేవి అలంకరణలో గుడిలోకి అడుగుపెట్టిన ఒక చిట్టి పాప, క్షణాల్లోనే అక్కడున్న భక్తులందరి దృష్టినీ ఆకర్షించి, ఆ ప్రాంగణంలో ఆనంద పరవశాలను నింపేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన క్యూట్ వీడియో

ఆస్థా మాలిక్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన చిన్నారి కుమార్తెను రాధాదేవి రూపంలో అందంగా తయారుచేసి గుడికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన క్యూట్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పాప చిన్న చిన్న అడుగులు వేస్తూ గుడిలో నడుస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ చెదరని చిరునవ్వులు పూశాయి.

చిన్నారికి భక్తుల పాదాభివందనాలు

ఆ క్యూట్ రాధమ్మను చూడగానే అక్కడున్న భక్తులు మురిసిపోయారు. కొందరు ఆ పాపను ప్రేమగా పలకరించగా, మరికొందరు భక్తితో ఆ చిన్నారి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ చిన్నారి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ "రాధే రాధే" అంటూ ప్రేమతో పలకరించడం ఆ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపేసింది.

తల్లి భావోద్వేగం

ఈ మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తల్లి ఆస్థా మాలిక్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. "నా చిట్టి రాధను చూసి ప్రజల ముఖాల్లో కనిపించిన ఆ నవ్వులు, వారు అందించిన ఆశీస్సులు, ఆ 'రాధే రాధే' పలకరింపులు ఈ క్షణాన్ని నా జీవితంలో ఎంతో ప్రత్యేకంగా మార్చేశాయి" అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

నెటిజన్ల మనసులు దోచుకున్న వీడియో

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గుడిలో ఉన్న చిన్న పిల్లలు కూడా ఆ పాప కాళ్లకు దండం పెట్టడం చూసి, "పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పిస్తున్నారు" అని కొనియాడారు. మరికొందరు మాత్రం, చిన్నారి అనుమతి లేకుండా ముట్టుకోకుండా కేవలం చేతులు చాచి ఆప్యాయత చూపించిన భక్తుల పద్ధతిని ప్రశంసించారు. ఏది ఏమైనా, ఆ చిట్టి రాధమ్మ రూపం నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story