Viral Video: మనుషులు కాదు మెషిన్లు అయిపోయేరు.. ట్రాఫిక్ జామ్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే!
భారతదేశంలో కార్పొరేట్ వర్క్ కల్చర్పై సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రాఫిక్ జామ్లో బైక్పై వెళ్తూ ప్రయాణంలోనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిచేస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: మనుషులు కాదు మెషిన్లు అయిపోయేరు.. ట్రాఫిక్ జామ్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే!
Viral Video: ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలిపే సంఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండటంతో పాటు ఉద్యోగుల పనివేళలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. బైక్ వెనుక కూర్చుని వెళ్తున్న ఒక వ్యక్తి ట్రాఫిక్ జామ్ కారణంగా బండి ఆగిపోగానే తన బ్యాగ్ నుంచి ల్యాప్టాప్ బయటకు తీశాడు.
రోడ్డుపై వాహనాలు కదలడానికి కాస్త సమయం పడుతుండటంతో, ఆ ఐదు నిమిషాల వ్యవధిలోనే అతను ల్యాప్టాప్లో సీరియస్గా టైప్ చేస్తూ పనిలో నిమగ్నమయ్యాడు. ఎనిమిది గంటల ఆఫీస్ పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే మార్గంలో కూడా ఇలా పనిచేసుకోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఇండియాలో ప్రజలు మెల్లగా యంత్రాలుగా మారిపోతున్నారు" అంటూ ఈ వీడియోను షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఆఫీస్ అయిపోయినప్పటికీ బాధ్యతల ఒత్తిడి కారణంగా ఇంటికి వెళ్లే దారిలో కూడా ఇలా పనిచేయాల్సి రావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగుల పట్ల ఉన్న అంకితభావం కాదని, దయనీయమైన వర్క్ కల్చర్ అని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం సరైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల యువత తీవ్రమైన మానసిక ఒత్తిడికి, బర్న్ అవుట్కు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో పెరుగుతున్న పోటీ తత్వం, నిరంతరం అందుబాటులో ఉండాలనే ఒత్తిడి ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా హరిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




