Puri Jagannath: పూరీ ఆలయంలో మొదలైన రథోత్సవ సన్నాహాలు

పూరీ ఆలయంలో జున్‌ 29 నుంచి జులై 27 వరకు నెలరోజులపాటు వివిధ రకాలైన ఉత్సవాలు జరగనున్నాయి. జులై 16న రథయాత్ర ప్రారంభం అవుతుంది. జులై 27తో యాత్ర సంపూర్ణమౌతుంది.

Balachander
Published on: 29 Jun 2026 9:17 AM IST
Puri Jagannath: పూరీ ఆలయంలో మొదలైన రథోత్సవ సన్నాహాలు
X

Puri Jagannath: ఒడిశాలోని పవిత్ర క్షేత్రమైన పూరీ, ఆ జగన్నాథుడి లీలలకు నిలయం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు 2026 జూన్ 29వ తేదీన సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు జరిగే ఈ మహా రథోత్సవ ప్రధాన ఘట్టం ఈసారి జూలై 16, 2026 గురువారం నాడు అత్యంత వైభవంగా జరగనుంది. కోట్లాది మంది భక్తుల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపే ఈ 10 రోజుల పవిత్రోత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సాధారణంగా దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి వెళ్తారు. కానీ, తన వద్దకు రాలేకపోతున్న దీనులను, భక్తులను అనుగ్రహించడానికి ఆ జగన్నాథుడే, అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి వీధుల్లోకి వచ్చే పరమ పవిత్ర ఘట్టమే ఈ రథయాత్ర.

రథయాత్ర ముఖ్యాంశాలు ... ప్రధాన తేదీలు

జూన్ 29, 2026 న అనవసర ఆచారం ప్రారంభం అవుతుంది. అంటే, స్నాన పూర్ణిమ ముగిసిన తర్వాత స్వామివార్లకు జ్వరం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు స్వామివారు ఏకాంత మందిరంలో ఉంటూ భక్తులకు దర్శనమివ్వరు. దీనినే 'అనసార' లేదా 'అనవసర' సమయం అంటారు. ఇక జులై 16, 2026న ప్రధాన రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఆషాఢ శుక్ల విదియ తిథి నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి తమ అద్భుత రథాలపై కొలువై, ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరే మహోజ్వల ఘట్టం.

జులై 20, 2026న హేరా పంచమిని నిర్వహిస్తారు. తనను వదిలి వెళ్లిన జగన్నాథుడిపై కోపంతో లక్ష్మీదేవి గుండిచా ఆలయానికి వచ్చి, స్వామివారి రథాన్ని పాడుచేసే ఆసక్తికరమైన లీలా విశేషం ఈ రోజు జరుగుతుంది. ఆ తరువాత జులై 24న బహుదా యాత్ర జరుగుతుంది. అంటే, గుండిచా ఆలయంలో 9 రోజుల విడిది తర్వాత, స్వామివార్లు తిరిగి ప్రధాన ఆలయానికి ప్రయాణమయ్యే తిరుగు రథయాత్ర ఘట్టం. జులై 27న నీలాద్రి బిజయ్‌ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ఉత్సవాల ముగింపు ఘట్టం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని, జగన్నాథస్వామి తన అన్న, సోదరితో కలిసి తిరిగి రత్నసింహాసనంపై కొలువుదీరడంతో ఈ రథోత్సవాలు సంపూర్ణమవుతాయి. జగన్నాథుడి రథాన్ని కనీసం ఒక్కసారైనా తాకినా లేదా ఆ రథ చక్రాల ధూళి ఒంటికి సోకినా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ ఉండదని స్కంద పురాణం చెబుతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story