ఇంగ్లాండ్ టూర్కి ముందే వైభవ్కి గుడ్ న్యూస్.. బంఫర్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ..!
Vaibhav Sooryavanshi India Debut: బీహార్కు చెందిన ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో ఇండియా-ఏ జట్టు తరపున ఆడుతున్నాడు.
ఇంగ్లాండ్ టూర్కి ముందే వైభవ్కి గుడ్ న్యూస్.. బంఫర్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ..!
Vaibhav Sooryavanshi India debut: భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ పర్యటనకు వెళ్తున్న ఈ అద్భుత ఆటగాడితో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ప్రయాణించేందుకు బోర్డు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది.
చిన్న వయసులోనే సీనియర్ల డ్రెస్సింగ్ రూమ్.. బీసీసీఐ భరోసా!
బీహార్కు చెందిన ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో ఇండియా-ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నీ ముగిసిన వెంటనే అతడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే సీనియర్ భారత జట్టుతో కలవనున్నాడు. అయితే, జట్టులోని మిగిలిన ఆటగాళ్లంతా 18 ఏళ్లు పైబడినవారు కావడంతో, 15 ఏళ్ల బుడ్డోడు అంత పెద్ద వాతావరణంలో ఒంటరిగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది.
సచిన్ టెండూల్కర్ నాటి రోజులను గుర్తు చేస్తూ..
ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. 1989లో కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రయాణాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దశాబ్దాల తర్వాత అంతటి ప్రతిభ కలిగిన ఆటగాడు మనకు దొరికాడని కొనియాడారు. సీనియర్ల మధ్య ఒక చిన్న పిల్లాడు ఒత్తిడికి గురికాకుండా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తల్లిదండ్రుల తోడు ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డు భావించింది.
విమర్శలు, స్లెడ్జింగ్ వాతావరణం నుంచి రక్షణ..
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ (నాలుగు ఇన్నింగ్స్ల్లో 117 పరుగులు), లంక ఆటగాళ్లతో మైదానంలో జరిగిన కొన్ని వాడివేడి వాగ్వాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక చిన్నారికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరమని, మైదానం వెలుపల అతడికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ బాధ్యతని సైకియా స్పష్టం చేశారు. కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని బోర్డు వైభవ్కు సూచించింది.
భారత క్రికెట్ భవిష్యత్తు రత్నమైన వైభవ్ సూర్యవంశీని అత్యంత జాగ్రత్తగా అక్కున చేర్చుకోవడంలో బీసీసీఐ చూపిన మానవత్వం అభినందనీయం. ఈ బ్రిటన్ పర్యటనలో తన తల్లిదండ్రుల సమక్షంలో వైభవ్ ఒత్తిడిని అధిగమించి, సచిన్ లాగే దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.




