India vs Afghanistan T20: అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్.. మరోసారి ఆ బ్యాడ్ లక్కోడు బెంచ్కే ఫిక్స్.. 3 మ్యాచ్ల్లోనూ నిరాశే..?
India vs Afghanistan T20:అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత్ సిద్ధమవుతోంది. ఏషియన్ గేమ్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్లో సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.
India vs Afghanistan T20: అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్.. మరోసారి ఆ బ్యాడ్ లక్కోడు బెంచ్కే ఫిక్స్.. 3 మ్యాచ్ల్లోనూ నిరాశే..?
India vs Afghanistan T20: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20ఐ సిరీస్లో సంజూ శాంసన్కు అవకాశాలు దక్కకపోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో జరగనున్న ఈ సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన బలమైన భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. అయితే అందరికీ తుది జట్టులో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు. ఈ క్రమంలో సంజూ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది.
అఫ్గాన్ సిరీస్కు పటిష్ఠ జట్టు..
ఈ సిరీస్ను ఏషియా గేమ్స్ (Asian Games) 2026 సన్నాహకాల్లో భాగంగా చూస్తున్నారు. అందుకే ఏషియన్ గేమ్స్లో ఆడనున్న ఆటగాళ్లనే ఈ జట్టులోకి తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా తదితరులు జట్టులో ఉన్నారు.
ఓపెనింగ్ రేసులో గట్టి పోటీ..
సంజూ శాంసన్ ప్రధానంగా ఓపెనర్గా ఆడుతున్నాడు. అదే స్థానానికి వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ కూడా అందుబాటులో ఉండటంతో పోటీ పెరిగింది. జింబాబ్వే పర్యటనలో వైభవ్ 151 పరుగులు చేసి తన ఎంపికను సమర్థించుకున్నాడు. అభిషేక్ మాత్రం ఆ పర్యటనలో 11 పరుగులకే పరిమితమయ్యాడు.
అభిషేక్ ఫామ్లోకి రావడంతో..
జింబాబ్వే సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ (Sher e Punjab T20 League)లో అభిషేక్ శర్మ బ్యాట్తో మెరిసి ఫామ్ అందుకున్నాడు. దీంతో ఓపెనింగ్ స్థానంలో అతడికి మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉండొచ్చని అంచనా.
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకం కొనసాగితే.. సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. మూడు మ్యాచ్ల సిరీస్ కావడంతో అందుబాటులో ఉన్న 15 మందికీ అవకాశం కల్పించడం కూడా సాధ్యం కాదు.
సెప్టెంబర్ 13 నుంచి పోరు..
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ఐలు సెప్టెంబర్ 13 నుంచి జరగనున్నాయి. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సిరీస్కు ఆతిథ్య హక్కులు అఫ్గానిస్థాన్కు ఉన్నాయి. ఈ పోరులో భారత జట్టు ఏసియన్ గేమ్స్ కోసం తమ కాంబినేషన్ను పరీక్షించుకోనుంది. సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




