MS Dhoni: ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్..? ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్
Irfan Pathan statement Dhoni: ఐపీఎల్ 2026 ప్రారంభంతో మరోసారి ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్కు ఇదే చివరి సీజన్ కావొచ్చని మాజీ భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించారు. ధోనీ మైదానంలో కనిపించే ప్రతి మ్యాచ్ అభిమానులకు భావోద్వేగ క్షణంగా మారవచ్చని ఆయన అన్నారు.
MS Dhoni: ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్..? ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్
MS Dhoni Last IPL Season: ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రభావం చూపిన ఆటగాళ్లలో ఎంఎస్ ధోని (MS Dhoni) ఒకరు. టీమిండియా తరపున, ఐపీఎల్ లోనూ అదరగొట్టిన తలా.. మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతాడోనని ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 28 నుంచి మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్( Indian Premier League 2026)లో ధోని బరిలోకి దిగనున్నాడు. ఈక్రమంలో ధోనీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది.
ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల మధ్య ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది—ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజనా? అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఇదే సమయంలో మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి.
ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు..
ఇటీవల జరిగిన ఒక చర్చలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ధోనీ ఫిట్నెస్ ఇప్పటికీ అద్భుతంగా ఉందని అన్నారు. అయితే ఒక ప్రొఫెషనల్ ఆటగాడిగా ఎప్పుడు ఆగాలి అనే విషయాన్ని ధోనీ బాగా తెలుసుకుంటాడని చెప్పాడు.
పఠాన్ ప్రకారం, ఈ సీజన్లో ధోనీ పసుపు జెర్సీలో ఆడటం అభిమానులకు చాలా భావోద్వేగ అనుభూతిని కలిగించవచ్చు. ఎందుకంటే, ఇది అతని చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చెన్నై జట్టులో ధోనీ పాత్ర..
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వ్యవహరిస్తున్నాడు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు వదిలినా, జట్టులో అతని ప్రభావం మాత్రం ఇప్పటికీ ఎంతో కీలకంగా ఉంది. జట్టులో కొత్తగా చేరిన శాంసన్ (Sanju Samson) వంటి ఆటగాళ్లకు కూడా ధోనీ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పఠాన్ అన్నారు.
ఐపీఎల్లో ధోనీ ప్రభావం..
ధోనీ పేరు కేవలం గణాంకాలకే పరిమితం కాదు. చెన్నై సూపర్ కింగ్స్కు ఎన్నో సంవత్సరాలు నాయకత్వం వహించి జట్టును 5సార్లు ఛాంపియన్గా నిలిపాడు.
వికెట్కీపర్గా ఆటను అర్థం చేసుకునే తీరు, డీఆర్ఎస్ నిర్ణయాల్లో అతని ఖచ్చితత్వం, ఒత్తిడి సమయంలో తీసుకునే నిర్ణయాలు—ఇవి అన్నీ ధోనీని ప్రత్యేకంగా నిలబెట్టాయి.
44 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం..
ప్రస్తుతం 44 సంవత్సరాల వయసులో కూడా ధోనీ అదే ఉత్సాహంతో క్రికెట్ ఆడటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ వయసులో చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ ధోనీ మాత్రం ఇప్పటికీ మైదానంలో తన ప్రభావాన్ని చూపిస్తున్నారు.
ఘనంగా వీడ్కోలు ఇవ్వాలనుకుంటున్న ఫ్రాంచైజీ..
చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కూడా ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్లో జట్టుకు ఆరో ఐపీఎల్ ట్రోఫీ అందించి ధోనీకి అద్భుతమైన ఫేర్వెల్ ఇవ్వాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, నిజంగా ఇదే ధోనీ చివరి సీజనా లేదా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సీజన్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.




